https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/chandra-babu.jpg?itok=YuWYtvvr

‘సొంత పనులు చూసుకుని బాబు హైదరాబాద్‌ వెళ్లారు’

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ విమర్శలు గుప్పించారు. పాలిమర్స్‌ బాధితులను పరామర్శిస్తానని అనుమతి తీసుకున్న చంద్రబాబు..  తన సొంత పనులు చూసుకుని హైదరాబాద్‌ వెళ్లారని ఆరోపించారు. ‘చంద్రబాబు కరకట్టకు ఎందుకు వచ్చారు? ఏ కారణంగా విశాఖకు రాకుండా హైదరాబాద్‌ వెళ్లారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఉంటే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద.. నివాళులర్పించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అమరావతి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఇక నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ఎమ్మెల్యే స్పందిస్తూ..  ‘న్యాయస్థానంపై మాకు అపారమైన గౌరవం ఉంది. ప్రతి తీర్పును న్యాయమని భావించాల్సిన పరిస్థితి లేదు’అని పేర్కొన్నారు.