https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/33-3.jpg

ఆ సినిమా ఆర్థకంగా దెబ్బ తీసింది..

 రోజాను తమిళ ఇండస్ట్రీకి `చెంబరుతి` సినిమా ద్వారా డైరెక్టర్ సెల్వమణి పరిచయం చేశారు. ఈ సినిమాలో ప్రశాంత్  హీరోగా  నటించగా.. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సెల్వమణి ..రోజా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారిందట. చివరకు 2002లో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రోజాకి పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది. విషయం మాత్రం ఎవరికీ తెలియదు. నిజానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పాడట.
రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమకోసం బాగానే కష్టపడిందట. ఆయన కోసం తమిళం బాష మాట్లాడటం చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్ ని  హ్యాపీగా లీడ్ చేస్తుంది.  అయితే 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ సినిమాను రోజా నిర్మించింది. అందులో హీరోహీరోయిన్లగా సుమన్.. రోజా తదితరులు నటించారు. ఇక ఈ సినిమాను రోజా భర్త ఆర్కె సెల్వమణి తెరకెక్కించాడు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా దెబ్బతో రోజాకు ఆర్థికంగా కుదేలైంది. అలా తన భర్త తీసిన సినిమా వల్ల నేను ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నానని రోజా తెలిపింది. ప్రస్తుతం రోజా దంపతులు తమ పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు.