https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/IMG-20200529-WA0112-678x381.jpg

పర్యాటక శోభ వెలగునున్న వెలుగిల్లు జలాశయం

గాలివీడు:మండలంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న వెలిగిళ్ళు పర్యాటక అభివృద్ధి కోసం 5 కోట్లు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ అరవీటి లక్ష్మి మల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వెలిగిళ్ళు జలాశయం,పార్కు తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో వెలిగళ్ళు ప్రాజెక్టు పర్యాటక అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. టూరిజం రెస్టారెంట్, గెస్ట్ హౌస్, బోటింగ్ పాయింట్,పది వసతి గృహాలు ఏర్పాటుకు ప్రతిపాదించమన్నారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు కుమార్,బాబు,ద్వారాకనాథ రెడ్డి,స్థానికులు కరిమిరెడ్డి విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.