https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/ts-20-678x381.jpg

తెలంగాణాలో కొత్త‌గా 169 కేసులు.. 2425కి పెరిగిన పాజిటివ్స్

హైద‌రాబాద్ – గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణాలో మొత్తం 169 కేసులు న‌మోద‌య్యాయి.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో 82, రంగారెడ్డిలో 14, సంగారెడ్డిలో 2, మెద‌క్ లో 2 కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా, వ‌లస కూలీలు 5గురికి, విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న 64 మందికి క‌రోనా సోకింది.. దీంతో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 2425కి పెరిగింది..కాగా ఈరోజు న‌లుగురు మ‌ర‌ణించారు.. దీంతో మ‌ర‌ణాలు సంఖ్య 71కి చేరింది.. నేడు 36 మంది కోలుకుని హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1381 మంది కోలుకుని ఇంటికి వెళ్ల‌గా,మిగిలిన 973 మంది వివిధ హాస్ప‌ట‌ల్స్ చికిత్స పొందుతున్నారు.