https://www.prabhanews.com/wp-content/uploads/2020/04/modi-9.jpg

న్యూఢిల్లీ : జూన్ 14 వరకూ లాక్ డౌన్ పొడగింపు?

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను మరో 14 రోజులు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ వచ్చే ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమంలోనే ఐదో విడత లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.