https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/41.jpg

పోలీసులకు ప్రత్యేక మాస్క్ లు..

పోలీసులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది నటి పూనమ్ కౌర్. సైబరాబాద్ పోలీసులకు 100 ప్రత్యేకమైన మాస్కులను బహూకరించింది.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి సీపీ సజ్జనార్ ను కలిసింది ఆమె. ప్రత్యేకంగా రూపొందించిన మాస్కులు అందజేసిన అనంతరం సజ్జనార్ కు సిక్కుల మతగురువు గురు గోవింద సింగ్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. తాను చిత్రపటాన్ని అందిస్తున్న సమయంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ బూట్లు తీసేసి ఎంతో భక్తిభావం ప్రదర్శించారని, అది భారతీయ సంస్కృతికి నిదర్శనం అని పూనమ్ కౌర్ కొనియాడారు. ఈ ఘటనతో పోలీస్ అంటే గౌరవం రెట్టింపైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ తో ఆమె సెల్ఫీ తీసుకుంది.