http://www.prajasakti.com/./mm/20200529//1590732603.nimma.jpg

హైకోర్టు ఆదేశాలతో విధుల్లో చేరతా : నిమ్మగడ్డ

       అమరావతి : హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు. హైకోర్టు సూచనలతో తిరిగి విధుల్లో చేరతానని చెప్పారు. విధులను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని తెలిపారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి త్వరలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తానని పేర్కొన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చేస్తామని ప్రమాణం చేసిన వారు ఆ బాధ్యతల్ని నెరవేర్చాలని పేర్కొన్నారు. కాగా, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్లదని భావిస్తున్నామని టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.