http://www.prajasakti.com/./mm/20200529//1590729074.corona-2.jpg

దేశంలో 7,466 కొత్త కేసులు నమోదు

       న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. గడిచిన (శుక్రవారం) 24 గంటల్లో 7,466 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 175 మంది బాధితులు మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,65,799 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 89,987 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 71,106 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్చయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 4,706 మంది బాధితులు చనిపోయారు.