https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/rashmika.jpg?itok=WfmIeLM1

వార్నర్‌ వీడియోకు ఫిదా అయిన రష్మిక

ఆస్ట్రేలియా క్రికెట్‌ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ ‘సరిలేరు నీకెవ్వరూ’లోని మైండ్‌ బ్లాక్.. మైండ్‌ బ్లాక్‌‌ పాటకు చేసిన టిక్‌టాక్‌కు హీరోయిన్‌ రష్మిక మందన్న ఫిదా అయింది. ఈ వీడియో చూసిన రష్మిక వార్నర్‌పై ప్రశంసలు కురిపించింది. కాగా తెలుగు స్టార్‌ హీరోల ఫేమస్‌ పాటలకు తన భార్య, పిల్లలతో కలిసి స్టేప్పులేస్తున్న టిక్‌టాక్‌ వీడియాలో తెగ వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. (‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్‌’)

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/27/mahesh_0.jpg

ఈ నేపథ్యంలో  సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లోని మైండ్‌ బ్లాక్‌ పాటకు టిక్‌టాక్‌ వీడియో చేశాడు. ఈ పాటలో ‘వాడిని కొట్టమని చెప్పు’ అనే లీరిక్స్‌కు వార్నర్‌ వినూత్నంగా టిక్‌టాక్‌ చేశాడు. ‘ఇది నా షాడో బ్యాటింగ్‌. ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారు. మళ్లీ కలుద్దాం’ అంటూ షేర్‌ చేసిన ఈ టిక్‌టాక్‌ వీడియో.. ప్రారంభంలో బ్యాటింగ్‌ చేస్తున్నట్లు ఫోజ్‌ ఇచ్చిన వార్నర్‌ ఆ తర్వాత మాయమైపోతాడు. ఇది చూసిన రష్మిక వార్నర్‌ క్యాప్షన్‌కు ఫిదా అవుతూ.. ‘‘డేవిడ్‌ వార్నర్‌ చంపేసారు పో.. మీ క్యాప్షన్‌ చదివాక నవ్వు ఆగడం లేదు’’ అంటూ ఆయన వీడియోకు కామెంట్‌ పెట్టింది. (ఎన్టీఆర్‌కు వార్నర్‌ స్పెషల్‌ విషెస్!)

ముక్కాల ముక్కాబులా అంటున్న వార్నర్‌
వార్నర్‌ నోట ‘పోకిరి’ డైలాగ్‌