https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/crime_0.jpg?itok=YTEjWiU7

జెన్‌కో ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

సాక్షి, రాజమండ్రి: జెన్‌కో ఇంజనీర్‌ శ్రీనివాస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్‌లో ఉన్న శ్రీనివాస్‌ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్‌ చేస్తుంటే తన కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి‌ భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.