https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/Crime_0126.jpg?itok=ST3NIBau

చెరువు ఒడ్డున తల్లీకూతుళ్ల శవాలు

లక్నో : తల్లితో పాటు ఇద్దరు మైనర్‌ కూతుళ్లను చంపి ఎండిపోయిన చెరువు ఒడ్డున పడేశారు దుండగులు. ఈ సంఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుభన్‌ ఖేదా తిక్రా గ్రామానికి చెందిన సరోజిని, ఆమె ఇద్దరు కూతుళ్లు శివానీ, రోషిణిలను గొంతు నులిమి హత్య చేసి అక్కడి ఓ ఎండిపోయిన చెరువు ఒడ్డున పారేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మూడు శవాలను పోస్టుమార్టమ్‌ నిమిత‍్తం తరలించారు. సరోజిని భర్త అనంతును, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాధమిక ఆధారాల ప్రకారం మృతురాలి భర్త, అతడి తమ్ముడే ఈ హత్యలకు పాల్పడిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ( భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని..)

చదవండి : ‘ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!’