https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/IMG_20200527_115731-678x381.jpg

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే: చంద్రబాబు

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకోసమే పనిచేశామని.. ఇంకా పనిచేస్తామని టిడిపి అధినేత చంద్ర బాబు మాట్లాడారు. టిడిపి నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడులో మాట్లాడిన ఆయన.. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం. ఎన్టీఆర్‌ హయాంలో ఆత్మగౌరవాన్ని ప్రభోదించారు. మా హయాంలో ఆత్మవిశ్వాసం పెంచాం. 36 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశాం. తెదేపా హయాంలో చేపట్టిన పథకాలు దేశానికి మార్గదర్శకమయ్యాయని చంద్రబాబు వివరించారు. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా శ్రేణులు వెనుకంజ వేయలేదు. ప్రాణాలు పోయినా పార్టీని వదిలేది లేదని చెప్పారు. ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా. కరోనా కష్టాల్లో తెదేపా కార్యకర్తల సేవాభావం మరువలేమని చంద్రబాబు అన్నారు.