హైదరాబాద్ : సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించి పరిష్కరిస్తాం : తలసాని

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించి నిర్ణయిస్తాం: తలసాని
సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌ తదితర అంశాలపై తెలుగు సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మరోమారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు సి.కల్యాణ్‌, దిల్‌ రాజు, డైరెక్టర్‌ ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేష్‌, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ రావ్మెూహన్‌ రావు, జీవిత తదితరులు పాల్గొన్నారు. ‘లాకడౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ రంగాలపై ఆధారపడ్డ లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌పై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్‌ పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని’ మంత్రి వివరించారు.