https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/112233-365-1.jpg

హైదరాబాద్ : పోతిరెడ్డిపాడుపై కెసిఆర్‌-జగన్‌ రహస్య ఒప్పందం

పోతిరెడ్డిపాడుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 15 తూములతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని దోచుకెళ్తున్నారని చెప్పారు. కృష్ణానది జలాల్లో అన్యాయాన్ని గుర్తించే సోనియా తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. అధికార మదంతో తెలంగాణకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సంగమేశ్వరం నుంచి నీటిని తీసుకెళ్లేందుకు ఏపీ- తెలంగాణ మధ్య చీకటి ఒప్పందంతో జీవో పుట్టుకొచ్చిందన్నారు. జగన్‌-కేసీఆర్‌ కలిసి ఆడుతున్న నాటకంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్పారు. ఆర్డీఎస్‌ విూద కేసీఆర్‌ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ మౌనం వీడటంలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది కృష్ణానదిలో తన వాటాకన్న ఏపీ అదనంగా వాడుకుందన్నారు. తెలంగాణ తనకు ఉన్నవాటాను కూడా వాడలేకపోయిందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ వైఖరి మారకుంటే ఆమరణ దీక్ష చేస్తామని తెలిపారు. ఇరిగేషన్‌పై సీఎం కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించారు.