https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/umapathi.jpg

హైదరాబాద్ : రిటైర్డ్ ఐఏఎస్ ఉమాపతిరావు కన్నుమూత

హైదరాబాద్‌ : కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట వంశీయుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పలు జిల్లాలకు కలెక్టర్‌ గా పనిచేసిన కామినేని ఉమాపతి రావు (92) కన్నుమూశారు. హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. గురువారం దోమకొండలో ఉమాపతి రావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ నటుడు రాంచరణ్‌ సతీమణి ఉపాసన ఉమాపతిరావుకి మనవరాలు. ఉమాపతి రావు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేశారు.ఆయన స్వస్థలం దోమకొండ. దోమకొండ సంస్థానాన్ని వారి పూర్వీకులు 400 ఏళ్ల పాటు పాలించారు. ఉమాపతి రావుకు అనిల్‌ కుమార్‌ ఒక్కడే కుమారుడు.1928లో జన్మించిన ఉమాపతి రావు నీతి నిజాయితీతో గొప్ప వ్యక్తిగా జీవించారని మనుమరాలు ఉపాసన పేర్కొన్నారు. చనిపోయిన ఉమాపతి రావు ఉర్దూ భాషలో కవితలు రాశారని ఆమె తెలిపారు. ఉమాపతిరావు మృతిపై సిఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఎపిలో వివిధ శాఖల్లో ఆయన సేవలు అవెూఘమని శ్లాఘించారు.