http://www.prajasakti.com/./mm/20200527//1590587415.bore.jpg

బోరు బావిలో పడిన చిన్నారి

హైదరాబాద్‌ : బోరు వేసిన అరగంటకే మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. పాపన్న పేట మండలంలో సాగుకోసం పంటపొలంలో బోరే వేశారు. అయితే వెంటనే కేసింగ్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆటలాడుకుంటున్న మూడేళ్లచిన్నారి సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాలుడిని వీలైనంత త్వరగా బావి నుండి బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.