http://www.prajasakti.com/./mm/20200527//1590591473.WhatsApp.jpg

బుల్లితెర నటి ఆత్మహత్య

'క్రైమ్‌ పెట్రోల్‌, లాల్‌ ఇష్క్‌, మేరీ దుర్గ' లాంటి హిందీ సీరియల్స్‌లో నటించిన బుల్లితెర నటి ప్రేక్షా మెహతా (25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు లేకపోవడంతో ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తల్లి దండ్రులతో కలిసి ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తండ్రి ప్రేక్షా గదిలోకి వెళ్లగా, ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 'కలలు చనిపోవడమే మన జీవితంలో చెత్త విషయం' అంటూ ప్రేక్షా మెహతా సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.