https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/Untitled-16-copy-21.jpg

ఫుడ్ డిస్ట్రిబ్యూష‌న్ లో డిస్ట్రిబ్యూట‌ర్‌..

అనకాపల్లిలో గత కొన్ని రోజులుగా ‘అన్నదాన కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు పలు రంగాలకు చెందిన ప్రముఖుల సహాయ సహకారాలతో.. డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ . ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఆయన ఈ కష్టకాలంలో ఫుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. భారత్ వికాస్ పరిషత్ సౌజన్యంతో.. గౌరీ శంకర్ నిర్వహిస్తున్న ఈ సేవా క్రతువుకు విశ్రాంత పోలీస్ అధికారి పీలా గోపాల్ రావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయి అవార్డు గ్రహీత శ్రీమతి పిల్లా నిర్మల వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఉడతాభక్తిగా.. కరోనా విపత్కాలంలో తాను చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి.. వివిధ రంగాలకు చెందిన అమృత హృదయులతోపాటు.. సినిమా రంగానికి చెందిన పలువురు మానవతావాదులు ఎంతో పెద్ద మనసుతో చేయూతనందిస్తుండడం, తనను ముందుకు నడిపిస్తోందని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్‌గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన గౌరీ శంకర్ తెలిపారు.