https://www.prabhanews.com/wp-content/uploads/2019/08/mallu-bhatti-1.jpg

హైదరాబాద్ : ఉన్నత విద్యను అంగడి సరుకు చేస్తారా: మల్లు భట్టివిక్రమార్క

ప్రజలంతా కరోనా ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్‌ మాత్రం సందట్లో సడెమియాలా వ్యవహరిస్తున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పైవేట్‌ యూనివర్సిటీలకు అనుమతిస్తూ వాటిని సొంతవారికి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన,   స్వార్థంతోనే సీఎం కేసీఆర్‌ ఐదు పైవేట్‌ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారన్నారు.   ప్రభుత్వ యూనివర్సిటీలకు స్టాఫ్‌ని, నిధులని కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని,ఉన్నత విద్యను బజారులో పెట్టి అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి మాల్లారెడ్డికి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి యూనివర్సిటీలు పెట్టుకునే అధికారం ఇవ్వడం అధికార దుర్వినియోగమే అని భట్టి తెలిపారు.