https://www.prabhanews.com/wp-content/uploads/2020/04/corona-telangana6655-1.jpg

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 66 కరోనా కేసులు

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 66తో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి పెరిగింది. కరోనా కారణంగా ఈ రోజు రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 56కు పెరిగింది. ఈ రోజు నమోదైన 66 కేసులలో 31 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. రంగారెడ్డి జిల్లాలో ఒకటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి కరోనాపాజిటివ్ వచ్చింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి కరోనా సోకింది.