https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/112233-365-1.jpg

శ్రీనగర్ : కాశ్మీర్ లో మరో ముగ్గురు ముష్కరులు హతం

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటే.. జమ్మూ-కశ్మీర్‌లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఇద్దరు ముష్కరులు హతం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా హింజిపొర ప్రాంతంలోని దమ్‌హాల్‌ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే వారు ఏ ఉగ్రముఠాకు చెందినవారో ఇంకా గుర్తింలేదు. ఇంకా అక్కడే మరికొందరు ముష్కరులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఇ