https://www.prabhanews.com/wp-content/uploads/2020/02/ttd-678x365.jpg

అమరావతి : టీటీడీ భూముల వేలం నిలుపుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు

టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆ ఆదేశాలలో పేర్కొంది. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం టీటీడీ బోర్డుకు సూచించింది.  ఈ భూముల్లో టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశం ను పరిశీలించాలి కోరింది. ఈ అన్ని అంశాలు పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను ప్రభుత్వం నిలుపుదల చేసింది.