http://www.prajasakti.com/./mm/20200525//1590416199.sam-sung.jpg

శాంసంగ్‌ నుండి మరో స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎ-31 పేరుతో జూన్‌ 4న విడుదల చేయనున్న ఈ ఫోన్‌ ధర రూ.23 వేలు ఉంటుందని సమాచారం. జూన్‌ -4 నుండి ఈ ఫోన్‌ను విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలను వెల్లడించింది. గెలాక్సీ ఎ -31 6. 4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి + సూపర్‌ అమోల్డ్‌్‌ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లేతో వస్తున్నట్లు తెలిపింది. మీడియా టెక్‌ హీలియో పి 65 ప్రాసెసర్‌ను వినియోగించనున్నట్లు సమాచారం. 4 జిబి రామ్‌, 6 జిబి రామ్‌ వేరియంట్లతో పాటు 6 జిబి, 128 జిబి ఇంటర్నల్‌ స్టోరేజీ కలిగి ఉంటుందని, మైక్రో ఎస్‌డి కార్డు సాయంతో 512 జిబి వరకు మెమోరీని పెంచుకోవచ్చని వివరించింది. నాలుగు కెమెరాలు, సెల్ఫీ కోసం ముందు వైపు 20 మెగా పిక్సెల్‌ కెమెరాను ఉంచింది.