https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160885649135651.jpg

హైదరాబాద్‌లో విషాదం.. నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం చోటుచేసుకుంది. నవ వధువు పింకీ ఆత్మహత్య చేసుకుంది. నెలన్నర కిందటే పింకీకి వివాహమైంది. పెళ్ళైన నెలన్నరకే నవ వధువు ప్రాణాలు తీసుకుంది. భర్త కుటుంబ సభ్యులపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.