https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160866642640684.jpg

గంజాయి ముఠా పట్టివేత...

విజయవాడ : విద్యార్థులు, కూలీలకు గంజాయిని విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల నేపధ్యంలో... అరెస్ట్ చేసి వారి నుంచి 13 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పల్సర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

 మైలవరం సీఐ శ్రీను, ఎస్సై ఈశ్వరరావు, రెడ్డిగూడెం ఎస్ ఐ శ్రీను, జి. కొండూరు ఎస్సై రాంబాబు తదితరులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ముఠాను ఛేదించిన సిబ్బందికి రివార్డు ప్రకటించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు డిఎస్పి బి.శ్రీనివాసులు తెలిపారు.