వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి సేవకుడా? దళారినా?: ఆనంద్‌ సూర్య

తిరుపతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి సేవకుడా? దళారినా? అని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య ప్రశ్నించారు. అమరావతిని విచ్ఛినం చేసి పబ్బం గడుపుకోవాలని సీఎం జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి శాసనమండలి గ్యాలరీలో ఏం పని అని ఆయన నిలదీశారు. విశాఖ శారదా పీఠంలో కూర్చుని సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దళారితనం చేయాలనుకుంటే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆనంద్ సూర్య చెప్పారు.