https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/delhi-bjp.jpg?itok=VZ5cvWV2

బీజేపీ వరాల జల్లు.. ఉచిత స్కూటీలు




సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఓటర్లపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోని శుక్రవారం విడుదల చేసింది. వీటిలోని ముఖ్య అంశాలను ఆ పార్టీ చీఫ్‌ మనోజ్‌ తివారీ మీడియా ముందు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌  యోజన పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్‌ పంపిణి చేస్తామన్నారు. ఢిల్లీ నివసించే పేదలు గోదుమలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కేవలం రెండు రూపాయాలకే కేజీ గోదుమ పిండి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జవడేకర్‌, మనోజ్‌ తివారీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.

బీజేపీ ప్రకటించిన మేనిఫేస్టోలని ముఖ్య అంశాలు..