మావోయిస్ట్ కేంద్ర కమిటీలో భారీగా సంస్థాగత మార్పులు...

నల్లమల : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ దేవరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన నేపధ్యంలో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. ఈ క్రమంలో 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటైంది. కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, ఝార్ఖండ్ నుంచి నలుగురు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుండి ఇద్దరు, బీహార్ నుండి ఒకరికి చోటిచ్చారు. ఆంద్రప్రదేశ్ నుండి కేంద్రకమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు @ బస్వరాజ్ ఉన్నారు.

 ఇక ఇతర సభ్యుల వివరాలు...

అక్కిరాజు హరగోపాల్ @ ఆర్ కే.

 తెలంగాణా నుండి 10మంది సభ్యులు... 1. ముప్పాళ్ల లక్ష్మణరావు @ గణపతి, కరీంనగర్.

2. మాల్లోజుల వేణుగోపాల్ @ వివేక్, కరీంనగర్.

3. కటకం సుదర్శన్ @ ఆనంద్, ఆదిలాబాద్.

4, మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్, కరీంనగర్.

5. తిప్పిరి తిరుపతి@ దేవ్ జీ, కరీంనగర్.

6. కడారి సత్యనారాయణ @ కోసా, కరీంనగర్.

7. మోడెం బాలకృష్ణ @ మనోజ్ , హైదరాబాద్.

8. పుల్లూరి ప్రసాద రావు@ చంద్రన్న, కరీంనగర్.

9. గాజర్ల రవి @ గణేష్, వరంగల్.

10. పాక హనుమంతు@ ఉకే గణేష్, నల్గొండ.