https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160626697205138.jpg

జర్మనీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: జర్మనీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహన్ రెడ్డి(23).. ఉన్నత చదువుల నిమిత్తం 2017లో జర్మనీ వెళ్లాడు. అక్కడి డస్‌బర్గ్-ఈస్సెన్ వర్సిటీలో చేరాడు. ఈ ఏడాదితో కోర్సు కూడా ముగిసిపోనుంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన తండ్రికి ఫోన్ చేసి బాధపడ్డాడు. తీవ్ర ఒత్తిడికి గురైన మొహన్ రెడ్డి.. బుధవారం తాను నివసిస్తున్న భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.