బ్రిడ్జీని ఢీకొట్టిన బొలెరో.. ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

అనంతపురం: జిల్లాలో రెండు వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బాదన్‌హాల్ బ్రిడ్జీని బొలెరో వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిప్పేస్వామి(50) మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన డి. హిరేహాల్ మండలంలో చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఇదిలా ఉంటే.. కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి దగ్గర బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.