https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/karem-shivaji.jpg?itok=MDKBZsgE

పవన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలి: కారెం శివాజీ

సాక్షి, తూర్పు గోదావరి: భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డా. బీఆర్‌ అంబేద్కర్‌ను అవమాన పరిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తక్షణమే క్షమాణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని పవన్‌ అగ్రకుల దురహంకారం వల్లే దళితుడైన అంబేద్కర్‌కు మంత్రి పదవిని మేమే ఇచ్చామని మాట్లాడుతున్నారన్నారు. ఈ క్రమంలో తక్షణమే జనసేన పార్టీ జెండా నుంచి అంబేద్కర్‌ చిత్రపటాన్ని తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

జనసేనకు గట్టి షాక్‌.. ‘జేడీ’ ఔట్‌