రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

చిత్తూరు: ఎస్‌ఆర్ పురం మండలం నెళవాయి సమీపంలో చెరకు ట్రాక్టర్, స్కూటర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందిన వారిని దిగువ ముది కుప్పం హరిజనవాడకు చెందిన రాంబాబు(20), అజిత్ కుమార్(24)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో భాషా అనే మరో వ్యక్తి గాయపడ్డాడు.