రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు

తిరుపతి: రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. దీని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 4.30కి సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. రథసప్తమి సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.