‘ఆయేషా కేసులో వైఎస్‌ ఎవరికి న్యాయం చేశారో అందరికీ తెలుసు’

విజయవాడ: ఆయేషా కేసును పక్కదారి పట్టించి మాజీ సీఎం వైఎస్‌ ఎవరికి న్యాయం చేశారో అందరికీ తెలుసని టీడీపీ నేత అనురాధ ఆరోపించారు. రూ.25 లక్షలు ఇస్తా ఆగిపోవాలని అప్పట్లో వైఎస్‌ చెప్పినట్లు.. ఆయేషా తల్లి కోర్టులో చెప్పిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై గిరిజన మహిళ ఫిర్యాదు చేయలేదని, పోలీసులు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో అశ్లీలతకు పగలబడి నవ్వే రోజా కూడా.. అశ్లీలత మీద మాట్లాడుతున్నారని పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.