https://www.ntnews.com/updates/latestnews/2019/harishhorticultaar.jpg

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

గజ్వేల్ : ఈ నెల 11న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో సందర్శించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వన విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్- పండ్ల కేంద్రం పరిశీలించారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగులో ఫారెస్ట్ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.