https://www.ntnews.com/updates/latestnews/2019/jnulathi.jpg

జేఎన్‌యూ విద్యార్థుల‌పై లాఠీచార్జ్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీలో జేఎన్‌టీయూ విద్యార్థుల‌పై ఇవాళ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హాస్ట‌ల్ ఫీజు పెంచ‌డాన్ని నిరసిస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు ర్యాలీ తీసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. బికాజీ కామా ప్యాలెస్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కారులు, పోలీసుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. బ్యారికేడ్ల పైనుంచి వ‌స్తున్న విద్యార్థుల‌ను పోలీసులు త‌రిమికొట్టారు. హాస్ట‌ల్ ఫీజులు పెంచినందుకు గ‌త నెల రోజుల నుంచి జేఎన్‌యూ విద్యార్థులు ధ‌ర్నా చేస్తున్నారు. పెంచిన ధ‌ర‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని విద్యార్థులు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కు లేఖ కూడా రాశారు. విద్యార్థుల‌పై పెట్టిన కేసుల‌ను ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు.