https://www.ntnews.com/updates/latestnews/2019/venkymama21.jpg

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ‘వెంకీమామ’ టీం సాహసం

విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్‌లో వెంకీమామ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మామ, అల్లుళ్ల అనుబంధం నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం అభిమానులకు మంచి వినోదాన్ని అందించడం ఖాయమని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

అయితే వెంకీమామ చిత్రయూనిట్ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కశ్మీర్‌కు వెళ్లింది. -4, -5 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో షూటింగ్ కోసం పెద్ద సాహసమే చేసింది. కేవలం గుర్రాలపై మాత్రమే వెళ్లే సౌకర్యం ఉన్న సోన్‌మార్గ్, పహల్గామ్ ప్రాంతాల్లో రెండు వారాల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. చిత్రబృందం కశ్మీర్ లోయల్లో తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా తీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయట. కేఎస్ రవీంద్ర (బాబీ)దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్.