https://www.ntnews.com/updates/latestnews/2019/modijhark.jpg

కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పారు : ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్: క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. జార్ఖండ్‌లోని హ‌జారిబాగ్‌లో జ‌రిగిన ఓ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌జాతీర్పును కాంగ్రెస్ పార్టీ అక్ర‌మంగా దోచేసింద‌ని, అందుకే ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌జ‌లు క‌ర్నాట‌క‌లో బీజేపీని గెలిపించార‌ని మోదీ అన్నారు. తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీనే స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని అందిస్తుంద‌న్నారు. ద‌క్షిణ భార‌త దేశంలో బీజేపీ పాత్ర స్వ‌ల్ప‌మే అన్న వారికి ఇది చెంప‌పెట్టు అని అన్నారు. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాతీర్పును వెన్నుపోటు పొడిచింద‌ని, ఇప్పుడు ఆ పార్టీలు గుణ‌పాఠం నేర్చుకున్నాయ‌న్నారు. ఇవాళ వెలుబ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో గెలిచిన‌వారిలో 11 మంది అన‌ర్హ‌త ఎమ్మెల్యేలే ఉన్నారు.