https://www.ntnews.com/updates/latestnews/2019/iasmovie.jpg

ఐఏఎస్ ఆఫీసర్ జీవిత నేపథ్యంలో సినిమా

ప్రజాదరణ పొందిన పలువురు ప్రముఖుల జీవితాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐఏఎస్ అధికారిణి జీవిత కథ నేపథ్యంలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. యూపీకి చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్‌పాల్‌పై త్వరలోనే సినిమా రానుంది.యూపీ రాజకీయాలను గడగడలాడించిన ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడి..ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారిణిగా ప్రజల మన్ననలు అందుకుంది దుర్గా శక్తి. బద్లా, కేసరి లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సునిర్ ఖేటర్‌పాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

ఈ విషయమై సునిర్ ఖేటర్ పాల్ మాట్లాడుతూ..ధైర్యసాహసాలు కలిగిన దుర్గా శక్తి అనే అధికారిణి కథ ఎంతోమందికి స్పూర్తిదాయకం. అజురే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాకుండా..మంచి, బలమైన కథాంశాలను అందిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ దైర్యంతో విధులు నిర్వర్తించిన దుర్గాశక్తి నాగ్‌పాల్‌ ను గౌరవించుకునే విధంగా సినిమా తెరకెక్కించడం జరుగుతుందన్నారు. 24 ఏళ్ల ప్రాయంలోనే ఐఏఎస్‌కు దుర్గాశక్తి నాగ్‌పాల్ ఎంపికయ్యారు.