https://www.ntnews.com/updates/latestnews/2019/nzisland.jpg

పేలిన అగ్నిప‌ర్వ‌తం.. అయిదుగురు మృతి

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌లోని వైట్ ఐలాండ్‌ అగ్నిప‌ర్వ‌తం పేలింది. ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. టూరిస్టు ప్రాంతం కావ‌డంతో అక్క‌డ భారీ జ‌న సందోహం ఉన్న‌ది. ఇప్ప‌టికే సుమారు 23 మందిని రెస్క్యూ చేశారు. వైట్ ఐలాండ్ అగ్నిప‌ర్వ‌తాన్ని వాకారి అని కూడా పిలుస్తారు. ఇది న్యూజిలాండ్‌లో అత్యంత యాక్టివ్ అగ్నిప‌ర్వ‌తం. పేలుడు సంభ‌వించిన స‌మ‌య‌లో ఆ దీవిలో సుమారు 50 మంది ఉన్న‌ట్లు సమాచారం ఉన్న‌ది. స్థానిక కాల‌మానం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు అగ్ని ప‌ర్వ‌తం పేలింది. దీంతో అక్క‌డ ద‌ట్ట‌మైన పొగ వ్యాపిస్తోంది.