https://www.ntnews.com/updates/latestnews/2019/ngkl.jpg

నిహారిక, చిన్నారుల ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్

నాగర్‌కర్నూల్: పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న నిహారిక కేసులో ఆమె భర్త, అత్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కూతురు మణిదీప్తి(4), కుమారుడు కేధరినాథ్(ఏడాదిన్నర) లపై కిరోసిన్ పోసి నిప్పంటించిన నిహారిక తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిహారిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త మహేశ్ యాదవ్, అత్త మంగమ్మలను అరెస్టు చేశారు.