https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114946817915021.jpg

వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన జగన్‌పై పొగడ్తలు వర్షం కురిపించారు. ‘సీఎం జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవల్ సమాచారం కరెక్ట్‌గా వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందో సమాచారం కచ్చితంగానే తెప్పించుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది’ అని చెప్పుకొచ్చారు. గణబాబు వ్యాఖ్యలు మరోసారి టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి.

 

ఇటీవలే క్లారిటీ.. 

కాగా.. గణబాబు టీడీపీకి టాటా చెప్పి వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈయన వ్యవహారం తెలుగుదేశంలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇటీవలే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారతారంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను పార్టీ మారుతాననేది ఊహాజనితమేనని అన్నారు. ఇదంతా మీడియా సృష్టేనని అన్నారు. ఎవరికైనా పార్టీ మారే ఆలోచన ఉంటే వాళ్లే మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందన్నారు.