https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114934829845870.jpg

ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై బ్యాన్ గురించి బీఏసీలో ప్రస్తావించిన అచ్చెన్నాయుడు

అమరావతి: ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ ప్రభుత్వం విధించిన నిషేధంపై బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. అసెంబ్లీలోకి రాకుండా మీడియాను ఈ విధంగా ఆపడం గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే వివరణ తీసుకోవాల్సిందని సూచించారు.

 

అచ్చెన్నాయుడు ప్రస్తావించిన అంశంపై సీఎం జగన్ స్పందిస్తూ.. వాళ్లు తప్పుచేశారని అంటున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లను పిలిపించి మాట్లాడుతానని అచ్చెన్నాయుడికి స్పీకర్ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు.