https://www.ntnews.com/updates/latestnews/2019/suspended.jpg

లంచం వాపస్ ఇప్పించిన కలెక్టర్

జగిత్యాల: రైతు వద్ద వీఆర్వో తీసుకున్న లంచం సొమ్మును కలెక్టర్ వాపస్ ఇప్పించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భూమి పట్టా కోసం రైతు వద్ద రూ.10 వేలు లంచంను వీఆర్వో రమేశ్‌రెడ్డి తీసుకున్నాడు. డబ్బు ఇచ్చినా వీఆర్వో పని చేయడం లేదని రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కలెక్టర్ శరత్ వీఆర్వోను పిలిచి విచారణ జరిపారు. లంచం సొమ్ము వాపస్ ఇప్పించిన కలెక్టర్ వీఆర్వో, వీఆర్‌ఏలను సస్పెండ్ చేశారు. లంచం ఇవ్వడం, లంచం డిమాండ్ చేయడం నేరమని ఎవరైనా లంచం కావాలని అడిగితే ఉన్నతాధికారులకు, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.