విశాఖలో ఉల్లి కోసం రోడ్డెక్కిన మహిళలు

విశాఖ: ఉల్లిపాయల కోసం మహిళలు రోడ్డెక్కారు. సోమవారం సీతమ్మధార రైతుబజార్‌లో ఉల్లిపాయలు సరఫరా చేయలేదని మహిళల ఆందోళన చేపట్టారు. రూ. 25/- సబ్సిడి ఉల్లి లేదని, 50/- ఉల్లి సరఫరా చేస్తామని చెప్పి కౌంటర్ మూసేశారని మహిళలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 5గంటల నుంచి మహిళలు ఉల్లిపాయల కోసం పడిగాపులు కాస్తున్నారు.