https://www.ntnews.com/updates/latestnews/2019/nh44.jpg

హైవే-44, సర్వీసు రోడ్లపై పోలీసు పెట్రోలింగ్

శంషాబాద్ : దిశ ఘటనతో శంషాబాద్ పరిధిలోని హైవే-44, సర్వీస్‌రోడ్ల దశ మారింది. పోలీసుశాఖ, ట్రాఫిక్ విభాగం నిబంధనలతో లారీల నిలిపివేత నిషేధం పకడ్బందీగా అమలు చేస్తున్నారు. శంషాబాద్ పరిధిలోని హైవే తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద, సర్వీస్‌రోడ్లపై లారీలు నిలుపడం లేదు. దిశ ఘటనకు ముందు గంటల తరబడి తొండపల్లి ప్లాజా వద్ద బారులు తీరేవి. ఇప్పుడు క్షణం కూడా ఆపడం లేదు. ఇక సర్వీసు రోడ్లపై పోలీసు పెట్రోలింగ్ పెంచారు.

నిలిపిన ఏ వాహనమైనా వెంటనే వెళ్లిపోయేలా చర్యలు చేపట్టారు. ఇక పెట్రోలు బంకుల్లో డబ్బాలలో పోసేందుకు నిరాకరిస్తున్నారు. కేవలం వాహనాల్లో మాత్రమే పోయడం జరుగుతుంది. బంకు సిబ్బందికి తగు సూచనలు పోలీసులు చేయడంతో అప్రమత్తమయ్యారు. ప్రతి బంకులో సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. జనం కూడా ఎవరూ డబ్బాలతో బంకులకు వెళ్లడం లేదు. దిశ ఘటన పలు మార్పులకు మార్గదర్శకమైంది.