https://www.ntnews.com/updates/latestnews/2019/raangiteaser1a.jpg

త్రిష 'రాంగీ' టీజర్ విడుదల

దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. ప్రస్తుతం ఆమె రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ అందించగా.. ఎం శరవణన్ దర్శకత్వం వహించారు. సి.సత్య మ్యూజిక్ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శుభాస్కరన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. రాంగీ చిత్రంలో త్రిష యాక్షన్ సన్నివేశాలతో దుమ్మురేపుతోంది. ఈ సినిమాతోనైనా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ కావాలన్న త్రిష ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఆమె గర్జన, 1818, పరమపదం విళైయాట్టు వంటి చిత్రాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంది.