https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114836425306759.jpg

జగన్ రెడ్డి ఉండగా.. ఉల్లి ఎందుకు?: పవన్ ట్వీట్

అమరావతి: వైసీపీ సర్కార్‌కు ఉల్లి ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక పక్క ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, మరోపక్క జనసేన ఉల్లిధరలపై ప్రభుత్వం ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారని.. కానీ జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదని తనదైన శైలిలో విమర్శించారు. అందుకే ఉల్లి ఎందుకంటూ.. దాని రేటు పెంచేశారని సెటైర్ వేశారు.

 

గత వారం రాయలసీమలో పర్యటించిన పవన్.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.  ప్రభుత్వాల వైఫల్యం వల్లే ధరలు ఇంత ఎక్కువగా పెరిగాయని విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలతో మధ్యవర్తులే లాభపడుతున్నారని... రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. ఉల్లి కోసం ప్రజలు రోజంతా వేచిచూసే పరిస్థితి రావడం దారుణమన్నారు.