https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114849517303887.jpg

ఆనం వ్యాఖ్యల వెనకున్న అర్థమేంటో కోటంరెడ్డి చెప్పాలి: మంతెన సత్యనారాయణరాజు

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. తొలిరోజు సభకు హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటంరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించడం మాని, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి ఆలోచించాలని సూచించారు. అసంతృప్తితో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ, టీడీపీల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆనం వ్యాఖ్యల వెనకున్న అర్థమేంటో కోటంరెడ్డి చెప్పాలని సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. వైసీపీలో అంతా మాఫియాలా తయారయ్యారంటూ ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలే అంటున్నారని సత్యనారాయణరాజు ఎద్దేవా చేశారు.