https://www.ntnews.com/updates/latestnews/2019/dkshivakumar0812.jpg

ఓటమిని అంగీకరిస్తున్నాం : డీకే శివకుమార్‌

బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. ఇటీవల 15 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఫిరాయింపుదారులకు ప్రజలు అండగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. ఈ ఓటమితో తాము ధైర్యం కోల్పోవడం లేదని శివకుమార్‌ పేర్కొన్నారు. 15 నియోజకవర్గాలకు గానూ.. భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో, కాంగ్రెస్‌ 2, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒక స్థానంలో లీడింగ్‌లో ఉన్నారు. మరికాసేపట్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడున్నాయి.